మెదక్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : తీరొక పూలతో తీర్చిదిద్ది ఆనందోత్సాహాల మధ్య నిర్వహించే పండుగ బతుకమ్మ అని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ, పౌర సరఫరాలు, కార్మిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వేపకాయల బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. అనంతరం మహిళా ఉద్యోగినులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భాగంగా 8వ రో జు ఆదివారం వెన్నముద్దల బతుకమ్మను జిల్లా వైద్యారోగ్య, రోడ్డు రవాణాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా రని తెలిపారు. బతుకమ్మ సంబురాల్లో మహిళా ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా న్యాయస్థానాల సముదాయంలో…
జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ప్రధాన న్యాయ మూర్తి లక్ష్మీశారద అధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వ హించారు. కార్యక్రమంలో మహిళా న్యాయవాది శారద, మహిళా ఉద్యోగులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.