మనోహరాబాద్, అక్టోబర్ 1 : తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తూ, రా ష్ర్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సీఎం కేసీఆర్ వైపే ప్రజలంతా ఉన్నారని సీఎం కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ మాదిరిగా తమ రాష్ర్టాలను సైతం మా ర్చాలని దేశ ప్రజలు సీఎం కేసీఆర్ రాకకోసం ఎదురు చూస్తున్నారని, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ప్రధాని కావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా శనివారం మ నోహరాబాద్లో ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డితోపాటు మనోహరాబాద్, తూప్రాన్ మండలాలకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీశ్చారి, నాయకులు భాస్కర్రెడ్డి, మన్నె శ్రీనివాస్, బురాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మహిపాల్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం
ఇండస్ పరిశ్రమ యాజమాన్యంతో మా ట్లాడి బోనస్ ఇవ్వడానికి ఒప్పించినందుకు పరిశ్రమ కార్మికులు సీఎం కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్కేవీ కంపెనీ యూ నియన్ అధ్యక్షుడు చిట్కుల మహిపాల్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇం డస్ మెడికేర్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహులు, ఉపాధ్యక్షులు ప్రవీణ్, శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ శేఖర్, జాయింట్ సెక్రటరీ నాగభూషణంరావు, శ్రీనివాస్, నా యకుడు చింతల ఆనంద్ పాల్గొన్నారు.