పుల్కల్, సెప్టెంబర్29: రూ.1.45 కోట్లతో పుల్కల్లో కొత్త దవాఖాన నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. సబ్బండ వర్ణాలకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తుండడం చూసి ప్రతి పక్షా లు ఓర్వలేక పోతున్నాయన్నారు. చౌటకూర్ మండలం నూతనంగా ఏర్పడిందని, ఇక నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
అందుబాటులో 108 వాహనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక నుంచి 108 వాహనం పుల్కల్లో ఉండేటట్లు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి చేసిన పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నామని, బిల్లులు మంజూరయ్యేలా చూడాలని జడ్పీ చైర్పర్సన్ను ఆయా గ్రామాల సర్పంచ్లు కోరారు. జిల్లా అధికారులతో మాట్లాడి బిల్లులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రైతువేదిక సమీపంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి పాల్గొని బతుకమ్మ ఆడి, పాడారు. కార్యక్రమంలో ఎంపీపీ చైతన్యా విజయ్భాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ గాజుల వీరేందర్, ఎంపీడీవో మధులత, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.