సిద్దిపేట, సెప్టెంబర్ 29 : కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలని, పట్టణ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో పట్టణ యూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేశారు. సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. సోషల్ మీడియా కార్యకర్త యాక్టీవ్గా ఉండాలని, క్రియాశీలకంగా పని చేయాలన్నారు. పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతిపక్ష బీజేపీకి మనపై ఎప్పుడూ ఏడుపు ఉంటుందని, బీజేపీ అధికారంలోని ఏ రాష్ట్రమైన, కేంద్రంలోనైన బాగుపడ్డ దాఖలాలు లేవని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు.
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థిక విధానాలు అవలంభించడం ద్వారా కేంద్రం ఆదుకోకపోయినా.. వివక్ష చూపినా అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉన్నదని, రాష్ట్ర ప్రజానీకానికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఏమీ చేయకుండానే బీజేపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని మనమంతా కలిసికట్టుగా తిప్పి కొట్టాలని కోరారు. గ్రామ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ శ్రేణులు యువత నిజాన్ని, వాస్తవాన్ని గ్రహించి బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్రెడ్డి, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్వీ పట్టణ ఆద్యక్షులు మహిపాల్ గౌడ్, చేపూరి శేఖర్గౌడ్, దరిపల్లి శ్రీను, యువజన విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్దిపేట పట్టణంలో 26వ వార్డుకు చెందిన బీజేపీకి చెందిన నాయకులు కెమ్మసారం నర్సింలు, శ్యామలత, ఆంజనేయులు, పవన్ కల్యాణ్ తదితరులు దాదాపు 50 మంది యువకులు మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి ఆహ్వానించారు.