సిద్దిపేట, సెప్టెంబర్ 22 : ఆసరా పింఛన్తో ప్రభుత్వం పేదలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు అన్నారు. గురువారం పట్టణంలోని 24వ వార్డులో ప్రభుత్వం మం జూరు చేసిన ఆసరా పింఛన్కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకులా ప్రతినెలా వృ ద్ధులకు రూ.2016 పింఛన్ ఇస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. మంత్రి హరీశ్రావు సహకారంతో సిద్దిపేటను దేశంలో ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మరోవైపు పట్టణంలోని 23వార్డులో కౌన్సిలర్ లక్ష్మణ్ లబ్ధిదారులకు ఆసరా పింఛన్కార్డులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమినషర్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట కమాన్, సెప్టెంబర్ 22 : అర్హులందరికీ ప్రతినెలా ప్రభుత్వం పింఛన్లు అందిస్తూ అండగా నిలుస్తున్నదని మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు అన్నారు. శుక్రవారం నాసర్పుర మహిళా భవన్లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ పింఛన్లు అందజేస్తున్నదన్నారు.
తొగుట, సెప్టెంబర్ 22 : అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బండారుపల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 57 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేస్తున్నదన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, సర్పంచ్లు శారదారఘోత్తంరెడ్డి, గోవర్ధన్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ రూరల్, సెప్టెంబర్ 22 : ప్రభుత్వం అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తున్నదని ఎంపీపీ మానస అన్నారు. మండలంలోని భల్లూనాయక్ తండాలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రజిత, ఉపసర్పంచ్ పాల్గొన్నారు.
గజ్వేల్, సెప్టెంబర్ 22 : నూతనంగా మంజూరైన ఆస రా పింఛన్కార్డులను గజ్వేల్ పట్టణంలోని అన్ని వా ర్డుల్లో కౌన్సిలర్లు లబ్ధిదారులకు అందజేశారు. 18వ వార్డులో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, 16వ వార్డులో కౌన్సిలర్ భాగ్యలక్ష్మీదుర్గాప్రసాద్, 15వ వార్డులో మెట్టయ్య, 20వ వార్డులో గోపాల్రెడ్డి, 10వ వార్డులో రహీం, ఒకటో వార్డులో బొగ్గుల చందు లబ్ధిదారులకు ఆసరా పింఛన్కార్డులను అందజేశారు.
కొండపాక, సెప్టెంబర్ 22 : సీఎం కేసీఆర్ పేదలకు పెద్ద కొడుకులా నిలిచారని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షురాలు చిట్టి మాధురి అన్నారు. గురువారం కొండపాకలో నూతనంగా మంజూరైన పింఛన్కార్డులను లబ్ధిదారులకు ఆమె అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భాస్కర్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), సెప్టెంబర్ 22 : నిరుపేదలకు కొండంత అండగా ఆసరా పథకం నిలుస్తున్నదని ధూళిమిట్ట సర్పంచ్ దుబ్బుడు దీపికావేణుగోపాల్రెడ్డి అన్నారు. గురువారం ధూళిమిట్ట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్కార్డులను లబ్ధిదారులకు ఆమె అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లింగం, పంచాయతీ కార్యదర్శి అనిత పాల్గొన్నారు.
చేర్యాల, సెప్టెంబర్ 22 : టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎంపీపీ కరుణాకర్ అన్నారు. మండలంలోని నాగపురి గ్రామంలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పింఛన్కార్డులను లబ్ధిదారులకు ఎంపీపీ అందజేశారు. మరోవైపు చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్, 3వ వార్డులో కౌన్సిలర్ చంటి లబ్ధిదారులకు పింఛన్కార్డులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ము న్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ సంయుక్త కార్యదర్శి తిరుపతిగౌడ్, సర్పంచ్ సంతోషికరుణాకర్, పాల్గొన్నారు.