సిద్దిపేట, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ఎనిమిదేండ్లలోనే తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా వెలుగులు నిండుతాయని అంటున్నారు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులు. ఆయన విజన్ ఉన్న నాయకుడని, అన్ని రంగాల్లో అపారమైన అనుభవం ఉందని, దేశాన్ని సమగ్రాభివృద్ధి చేయగల సమర్థుడని చెబుతున్నారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తే ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ మాదిరి పథకాలు దేశవ్యాప్తంగా అమలై పేదల బతుకుల్లో వెలుగులు నిండుతాయని, ఆయన జాతీయ పార్టీ పెట్టాల్సిందేనని ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నరు.
ప్రాంతీయ పార్టీలపై బీజేపీ కుట్రలు
ప్రాంతీయ పార్టీలను అణచి వేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. రాష్ర్టాలన్నింటినీ కలుపుకొని పోవాల్సిన కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నది. రాష్ర్టానికి దక్కాల్సిన నిధులు ఇవ్వడం లేదు. తెలంగాణపై పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. నిధులు మంజూరు చేయాలని పలుమార్లు అడిగినా ఫలితం లేకపోయింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అన్ని గ్రామాలు, పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందాయి. కుల, మతాలకతీతంగా అభివృద్ధి సాధించాలంటే జాతీయ భావాలు కలిగిన మంచి నాయకుడు దేశానికి అవసరం. అలాంటి నాయకత్వ పటిమ మన సీఎం కేసీఆర్లో ఉన్నది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని రాష్ర్టాలకు సమాన హక్కులు దక్కుతాయి. అభివృద్ధి, సంక్షేమం అన్ని వర్గాలకు అందే అవకాశాలుంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్కే దక్కింది. అలాగే రాష్ట్రంలో గొప్పగా అభివృద్ధి జరిగింది. అలాంటి గౌరవం దేశమంతా దక్కాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే.
దేశాన్ని ఏలే సత్తా కేసీఆర్కు ఉంది..
దేశాన్ని ఏలే సత్తా సీఎం కేసీఆర్కు ఉంది. జాతీయ రాజకీయాల్లోకి వస్తే కేసీఆర్కు తిరుగుండదు. దేశంలోని బడుగు బలహీన వర్గాలు, రైతులు, వ్యాపార వేత్తలు కేసీఆర్ రాకను స్వాగతిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపారు. ఇలాంటి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని కావాలి. తెలంగాణపై వివక్ష, బీజేపీ కుటీల రాజకీయాలు ఆగాలంటే కేసీఆర్ దేశానికి కేసీఆర్ సేవలు అవసరం.
-తోడుపునూరి చంద్రపాల్, మెదక్ మున్సిపల్ చైర్మన్
ప్రజల కష్టాలు తెలిసిన నేత
ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని గట్టెక్కించి ప్రజలను ఆనందంగా ఉంచగలిగే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధలను కండ్లారా చూసి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి సాకారం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశ పెడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు, ప్రజా వ్యతిరేక విధానాలతో నియంత పాలన కొనసాగిస్తున్నది. దేశంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసిన కేసీఆర్, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఆయనతోనే దేశాభివృద్ధి సాధ్యం. కేసీఆర్ లాంటి నాయకుడే ప్రస్తుతానికి దేశానికి అవసరమని ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, అధికారులు కోరుకుంటున్నారు. అందరి మద్దతుతో జాతీ య రాజకీయాల్లోకి వెళ్తున్న సీఎం కేసీఆర్ తప్పకుండా విజయం సాధిస్తారు అని ప్రముఖులు పేర్కొంటున్నారు.
కేసీఆర్ విజన్ దేశానికి చాలా అవసరం
సీఎం కేసీఆర్కు ఉన్న విజన్ దేశంలో మరెవరికీ లేదు. ఆయన విజన్ దేశానికి చాలా అవసరం. తెలంగాణలో 70 ఏండ్ల పాలన ఒకెత్తు అయితే గడిచినా ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి మరో ఎత్తు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్తో పవర్హాలీడే సమస్య ఉంది. కానీ, తెలంగాణలో రైతులు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నారు. దేశంలో అపారమైన వనరులు ఉన్నా వాటిని ఉపయోగించుకోవడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం. దేశాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేం ద్రం కుట్రలు చేస్తున్నది. దానిని అడ్డుకునే శక్తి సీఎం కేసీఆర్కే ఉంది. దేశంలో సుస్థిర పాలన అందాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
-కల్లూరి హనుమంతరావు, కేహెచ్ఆర్ ట్రస్టు చైర్మన్
దేశం దశ, దిశ మార్చే నాయకుడు కేసీఆర్
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అనతి కాలంలోనే బంగారు తునకగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. 75 వసంతాల స్వాతంత్య్ర భారత దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. దేశ దశ, దిశ మార్చే దమ్మున్న నాయకుడు కేసీఆర్. ఉద్యమ సూరీడు కేసీఆర్ దేశ రాజకీయాల్లో వస్తే ప్రాజెక్టులు, రోడ్లు, ఉద్యోగాలు, 24 గంటల కరెంటు తదితర అభివృద్ధి కిరణాలు దేశమంతటా ప్రసరిస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. దేశంలోని ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది. బీజేపీ నాయకులు కేవలం మత రాజకీయాలకే పరిమితమయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తెగనమ్మడమే ఆ పార్టీ ధ్యేయం. అభివృద్ధే అజెండాగా ముందుకు సాగుతున్న గొప్ప రాజనీతిజ్ఞుడు కేసీఆర్. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి, బీజేపీ, కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యం.
– బొంది రాఘవేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్, తూప్రాన్
దేశానికి కేసీఆర్ సేవలు అవసరం
దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడి సేవలు అవసరం. జాతీయ రాజకీయాల్లో రాణించగల సత్తా ఉన్న నాయకుడు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి రావ డం అవసరం. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసి, ప్రజలకు మేలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కేసీఆర్ పోరాడుతున్నారు. కేసీఆర్ పట్ల దేశ ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారు. ఇంతటి అభిమానం ఉన్న నేతకు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. తెలంగాణ సమాజం సైతం కేసీఆర్ వెన్నెంటే నడుస్తున్నది.
-ఆరేళ్ల మల్లికార్జున్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్, మెదక్
దేశ ప్రజలకు మేలు
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే, దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసి పేద ప్రజలకు లబ్ధి చేకూర్చవచ్చు. కేసీఆర్కు దేశ రాజకీయాలపై అపూర్వమైన అనుభవం ఉంది. రాష్ట్ర సాధన కోసం ఆయన పోరాట పఠిమను దేశ ప్రజలు చూశారు. దేశం బాగుపడాలంటే కేసీఆర్కు దేశ ప్రజలు పట్టంకట్టాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ లాంటి వ్యక్తి మా రాష్ర్టాలకు సీఎంగా ఉండాలని కోరుకుంటుండ్రు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదే.
– సింధూఆదర్శ్రెడ్డి, కార్పొరేటర్, భారతీనగర్
కేసీఆర్ నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తుండ్రు..
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తుండ్రు. కేసీఆర్ లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో ఉంటేనే దేశం, ప్రజలకు మంచి జరుగుతుంది. మంచి రాజనీతిజ్ఞుడైన సీఎం కేసీఆర్ అవసరం కేవలం తెలంగాణకే కాదు దేశానికి కావాలని ఇప్పుడు దేశ ప్రజలు అనుకుంటుండ్రు. సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. పేద ప్రజల బతుకులు మారాలంటే, దేశం బాగుపడాలంటే సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుండ్రు.
-పుష్పానగేశ్, కార్పొరేటర్, ఆర్సీపురం
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర వహించాలి
దేశరాజకీయాలను ఉత్తర భారతానికి చెందిన వారే శాసిస్తున్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ దేశ్కీ నేత కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఉత్తర భారతానికి చెందిన వారికంటే దక్షిణ భారతానికి చెందిన నేత ప్రధాని పదవిలో ఉండాలి. అప్పుడే దక్షిణ భారతానికి చెందిన రాష్ర్టాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్తాయి. తెలంగాణను అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిపారు. దేశం ఆర్థిక సంక్షోభం, కష్టకాలంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి రాజకీయ నైపుణ్యం, చాణుక్యుడైన కేసీఆర్ అవసరం. దేశ ప్రజలకే శ్రేయస్కారం. దీనికి రాష్ట్ర ప్రజలతో పాటు పొరుగు రాష్ర్టాలు కూడా స్వాగతిస్తున్నాయి.
-మంద బలరాంరెడ్డి, రైతు సంఘం నాయకుడు, గుమ్మడిదల