నర్సాపూర్, సెప్టెంబర్ 18 : మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు స్థలాన్ని చదును చేసి పనులను ప్రారంభించారు. నర్సాపూర్లోని పోలీస్స్టేషన్ పక్కన పాత మున్సిపల్ కార్యాలయం ఉన్నది. పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చివేసి అదే స్థలంలో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. రూ.2.20కోట్లతో భవన నిర్మాణానికి రెండేండ్ల క్రితం మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. అక్కడి స్థలం మున్సిపల్ భవన నిర్మాణానికి సరిపోదని, నీటి పారుదల కార్యాల య సమీపంలోని స్థలం అనువుగా ఉందని మంత్రి హరీశ్ రావుకు ఎమ్మెల్యే వివరించారు. కొన్ని కారణాలతో మున్సిపల్ భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ్ద చూపడంతో నిర్మాణ పనులను వేగవంతం చేశారు.
మున్సిపాలిటీ భవన నిర్మాణాన్ని అన్ని హంగుల్లో నిర్మించడానికి ప్రణాళికను సిద్ధ్దం చేశారు. 4900 చదరపు అడుగుల స్థలంలో రూ.2.20 కోట్లతో నీటి పారుదలశాఖ కార్యాలయ సమీపంలో జీ+1 నమూనాలో మున్సిపల్ భవనాన్ని నిర్మి స్తున్నారు. భవనంలో కౌన్సిలర్ల ఆఫీసు, మీటింగ్ హాల్, ఇంజినీర్ గది, స్టాఫ్ రూమ్, ప్రజలు కూర్చోడానికి సౌకర్యవంతమైన హాల్ను నిర్మించనున్నారు. మున్సిపల్ భవన నిర్మాణం పూర్తయితే పరిపాలన సౌలభ్యం లభిస్తుందని పట్టణ వాసులు ఆశిస్తున్నారు. పాత భవనంలో స్థలం సరిపోక ప్రజలు, మున్సిపల్ సిబ్బంది ఇబ్బంది పడేవారు. రెండు నెలల్లో మున్సిపల్ భవన నిర్మాణ పనులను పూర్తి చేసి మున్సిపాలిటీకి అప్పగిస్తామని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటున్నారు.
అన్ని హంగులతో మున్సిపల్ భవనం
నర్సాపూర్ మున్సిపల్ భవనాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నాము. నా ణ్యతలో లోటుపాట్లు లేకుండా భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను. రెండు నెలల్లో పనులను పూర్తి చేసి, భవనాన్ని ప్రా రంభిస్తాము. మున్సిపల్ భవనంతో పాటు ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేసి, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తాను.
– మదన్రెడ్డి, ఎమ్మెల్యే