చిలిపిచెడ్, మే 26: సోమక్కపేట వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ముమ్మరంగా వడ్లు కొంటున్నారు. గ్రేడ్-1 రకం క్వింటాలుకు రూ.1960, గ్రేడ్-2 క్వింటాలుకు రూ.1940 మద్దతు ధర అందిస్తున్నారు. దీంతో రైతులు తమ ధాన్యాన్ని ఈ కేంద్రంలో విక్రయించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు రైతులు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు ఆరుకొర ధరకు అమ్ముకునేవారు. వ్యాపారికి నచ్చిన ధరకే ధాన్యం అమ్మాల్సివచ్చేది. ధర తక్కువతో పాటు తూకంలోనూ రైతులు భారీగా నష్టపోయేవారు. ధాన్యం అమ్మిన నెల రోజులకు రైతులకు డబ్బులు చెల్లించేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తూకంలో ఎలాంటి పొరపాటు లేకుండా చర్యలు చేపడుతున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన బిల్లులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. దీంతో దళారుల బెడద కూడా తగ్గింది. ఎవరికీ కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.
అజ్జమర్రి, బండపోతుగల్, ఫైజాబాద్, చిలిపిచెడ్, చండూర్, చి ట్కుల్, గౌతాపూర్, రాందాస్గూడ, బుజరంపేట, సోమక్కపేటలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల్లో ఇప్పటి వరకు 45 వేల క్వింటాళ్ల ధాన్యం కొన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాల వద్ద రైతులకు ఎండ తగలకుండా టెంట్లు వేశారు. తాగు నీటి సౌకర్యం కల్పించారు.
సోమక్కపేట వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి 16 శాతం లోపు తేమ ఉన్న నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందవచ్చు. ధాన్యం కొనుగోలు, గోనె సంచుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ధాన్యం కొనుగోలు తర్వాత రైతుల బ్యాంక్ అకౌంట్, ఆధార్కార్డు, పట్టా పాసుబుక్ జిరాక్సులు ఇవ్వాలి. వారి ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయి.
– నారన్నగారి ధర్మారెడ్డి, సొసైటీ చైర్మన్