తొగుట, ఆగస్టు 11 : సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు. గురువారం తొగుట మండల పరిషత్ కార్యాలయంలో 18 గ్రామాల ఫీల్ట్ అసిస్టెంట్లు విధుల్లో చేరారు. ఎంపీడీవో శ్రీధర్, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆయన స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు ఎల్లారెడ్డి, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అక్కన్నపేట, ఆగస్టు 11 : కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాల మేరకు ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఎంపీడీవో సత్యపాల్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ లక్ష్మీబీలూనాయక్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు విజయవంతం చేశారన్నారు. భవిష్యత్లో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం హర్షణీయమన్నారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలన్నారు. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
హుస్నాబాద్ రూరల్, ఆగస్టు 11 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో చేరారు. మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీవో అనిత సమక్షంలో ఆయా గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు రిపోర్ట్ చేశారు. తమ ఇబ్బందులను గుర్తించి విధుల్లోకి తీసుకున్న సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు సదానందం పాల్గొన్నారు.
కొమురవెల్లి, ఆగస్టు 11 : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను సీఎం కేసీఆర్ ఇచ్చినమాట ప్రకారం తిరిగి వీధుల్లోకి తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కొమురవెల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం పీపీ కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిద్ధప్ప, ఎంపీడీవో అనురాధ, కో-ఆప్షన్ సభ్యుడు లాల్భాగన్, మండల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.