చేగుంట, సెప్టెంబర్ 7: చేగుంటలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో వసతులు సరిగా లేవని గురుకుల సిబ్బందిపై అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ స్పోర్ట్స్ గురుకుల పాఠశాలను ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీడీవో ఆనందర్మేరీతో కలిసి ఆమె తనిఖీ చేశారు.
పాఠశాలలో మరుగుదొడ్లు, వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. నాణ్యమైన భోజనం అందిస్తాలేరని విద్యార్థులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరిగితే సిబ్బందిని బదిలీ చేస్తామని హెచ్చరించారు. ఆమె వెంట ఎంపీపీ శ్రీనివాస్ ఉన్నారు.