చిన్నశంకరంపేట,ఏప్రిల్ 18 : త్వరలో భూ సమస్యలను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు పట్టాపాసు బుక్కులు అందజేస్తామని మెదక్ కలెక్టర్ రాజార్షిషా అన్నారు. మంగళవారం చిన్నశంకరంపేటలోని తహసీల్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్తో పాటు కలిసి అధికారులతో మండలానికి సంబంధించిన కార్యక్రమాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని సూరారం ఎస్. కొండాపూర్ గజగట్లపల్లి గ్రామాల ధరణి పాస్బుక్స్ సంబంధించిన సమస్యలను రెవెన్యూ ఫారెస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నా రు. వెంటనే భూ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల టి. మాందాపూర్ గ్రామానికి చెందిన 60మంది లబ్ధిదారులకు ఆర్థిక మంత్రి హరీశ్రావు చేతుల మీ దుగా పట్టా పాసు బుక్కులను అం దించడం జరిగిందన్నారు.
మిగతా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు పట్టాబుక్కులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు గ్రా మాల్లో ఉన్న సమస్యలను చర్చించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తా మన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పా ట్లు చేశామని తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలో 19కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తారన్నా రు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడుత గొర్రెల పంపి ణీ సంబంధింత అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించామన్నారు. త్వరలో మండల స్థాయిలో లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, కడప, కర్ణాటక రాష్ట్రంలోని రెండు జిల్లాల నుంచి గొర్రెలు పొట్టెలు కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చిందన్నారు.
కాల్వ పనులను పరిశీలించిన కలెక్టర్
మండలంలోని గవ్వలపల్లి గ్రామశివారులో కొనసాగుతున్న కాళేశ్వరం కాల్వ నిర్మాణ పనులను కలెక్టర్ రాజార్షి షా పరిశీలించారు. బ్రిడ్జిల నిర్మాణాలను కల్వర్టులు అండ ర్ టన్నెల్ కాల్వ తవ్వకం పనులను పరిశీలించి సంతృప్తి వ్య క్తం చేశారు. పనుల్లో వేగం పెంచి మే నేలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసా ద్ నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాసరావు ఆర్డీవో సాయి రాం, తహసీల్దార్, మహేందర్గౌడ్ ఉన్నారు.