చేగుంట, సెప్టెంబర్ 7: చేగుంటలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో వసతులు సరిగా లేవని గురుకుల సిబ్బందిపై అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ స్పోర్ట్స్ గురుకుల పాఠశాలను ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీడీవో ఆనందర్మేరీతో కలిసి ఆమె తనిఖీ చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లు, వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. నాణ్యమైన భోజనం అందిస్తాలేరని విద్యార్థులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరిగితే సిబ్బందిని బదిలీ చేస్తామని హెచ్చరించారు. ఆమె వెంట ఎంపీపీ శ్రీనివాస్ ఉన్నారు.
పౌష్టికాహారం అందించాలి
తూప్రాన్, సెప్టెంబర్ 7 : అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు, గర్భిణులకు సీమంతాలు ఘనంగా నిర్వహించాలన్నా రు. పిల్లలకు ప్రతిమాసింగ్ అన్నప్రాసన చేశారు. ఆమె వెంట సీడీపీవో హేమభార్గవి, సూపర్వైజర్ స్వరూప, మున్సిపల్ కమిషనర్ మోహన్, కౌన్సిలర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.