మెదక్, ఏప్రిల్ 13: సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. మెదక్ నియోజకవర్గంలో అనారోగ్యానికి గురై ఉన్నత వైద్యసేవల కోసం దవాఖానలో చికిత్స చేయించుకున్న వివిధ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మొత్తం రూ.7,59,900 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన పలువురికి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను సంబంధిత 13 మంది లబ్ధిదారులకు అందించామన్నారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రాజేందర్రెడ్డి, సర్పంచ్లు యామిరెడ్డి, మహిపాల్రెడ్డి, చౌట్లపల్లి సర్పంచ్ లక్ష్మి, హవేళీఘణాపూర్ ఎంపీటీసీలు కిష్టాగౌడ్, సిద్ధిరాంరెడ్డి, అర్చనశ్రీనివాస్, మాజీ సర్పంచ్ కిరణ్గౌడ్, భిక్షపతిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.