మోడల్గా కల్యాణమండపం
ఊరంతా పచ్చదనం
కుంటలకు గోదవరి నీళ్లు
సమష్టిగా బిందుసేద్యం
పధానమంత్రి చేతుల మీదుగా స్వచ్ఛతశక్తి అవార్డు
సీఎం కేసీఆర్ స్ఫూర్తి గ్రామస్తుల ఐక్యతతో అభివృద్ధిలో ఆదర్శం
మర్కూక్, జూన్ 6: ఆరేండ్ల కింద ఆ ఊరంటేనే ఎవరికి తెలియదు.. అభివృద్ధికి ఆమడ దూరంగా ఉండేది. మారుమూల పల్లెను సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో నేడు రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడంతో బంగారు వల్లిగా మారింది. సీఎం స్ఫూర్తి.. గ్రామస్తుల ఐక్యతతో అభివృద్ధిలో తమదైన ముద్ర వేసుకున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పథకం ద్వారా ఎర్రవల్లి ప్రగతివల్లిగా దర్శనమిస్తున్నది.
నాడు పెంకుటిల్లు..
నేడు ఊరంతా బంగ్లాలు..
నాడు తాతలు కట్టిన పెంకుటిల్లు ఉండేవి. ఒకటి రెండు బంగ్లాలుండగా, పదిగాళ్ల గుడిసెలు ఉండేవి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం పథకం ముందుగా ఎర్రవల్లి గ్రామంలో ప్రారంభించారు. సీఎం కేసీఆర్ స్వయంగా పర్యటించి పెంకుటిల్లు లేని గ్రామంగా తయారు చేయాలని ఊరంతా డబుల్ బెడ్రూం మంజూరు చేసి కట్టించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంతో ఎర్రవల్లి గృహవల్లిగా మారింది. ఇండ్లతో పాటు విశాలమైన సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మాణాలు నిర్మించారు.
ముందుగానే ముద్దాడిన గోదావరమ్మ..
గ్రామానికి ముందుగానే గోదావరి నీళ్లు వచ్చాయి. గ్రామంలోని నాలుగు కుంటలను మరమ్మతులు చేపట్టారు. పాండురంగా కుంటను లక్షల నిధులతో మరమ్మతులు చేశారు. నాలుగు కుంటలతోపాటు పాండురంగా రిజర్వాయర్ ముందుగానే హైదరాబాద్కు వెళ్లే పైపు కనెక్షన్తో గోదావరి నీళ్ల సరఫరా చేసి కుంటలను నింపారు. ఎర్రవల్లి పక్కన ఉన్న కూడవెల్లి వాగును రూ. 48 కోట్లతో పునరుద్ధరణ చేపట్టారు. దీంతో ఎర్రవల్లి చుట్టూ జలకళ వచ్చింది. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ద్వారా కుంటలను నింపారు.
ఎర్రవల్లికి అవార్డుల పంట…
ఎర్రవల్లి గ్రామం అభివృద్ధిలో మోడల్గా నిలిచింది. దీంతో రెండు జాతీయ స్థాయిలో అవార్డు పొంది మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టారు. గ్రామం స్వచ్ఛతశక్తి అవార్డుకు ఎంపికైంది. భాగ్యాభిక్షపతి మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. మరుగుదొడ్లను అందంగా తీర్చిదిద్దడంతో వ్యక్తిగత విభాగంలో హర్యానాలోని ఢిల్లీలో కేంద మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదుగా సర్పంచ్ అవార్డును అందుకున్నారు.
ఎర్రవల్లికి వన్నె తెచ్చిన ఫంక్షన్ హాల్
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఎర్రవల్లిలో అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చారు. అన్ని వసతులతో పాటు ప్రభుత్వం ఫంక్షన్ హాల్ను నిర్మించారు. ఫంక్షన్హాల్ ఎంతో బాగుంటుంది, పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపడుచుల పెండ్లికి ఎంతో ఉపకరిస్తున్నది. ఫంక్షన్ హాల్ నిర్వహణ ఖర్చులకు మాత్రమే నామమాత్రపు రుసుంతో గ్రామస్తులంతా వినియోగించుకుంటున్నారు. ఫంక్షన్హా ల్ నిర్మాణం గ్రామానికి మరెంతో వన్నె తెచ్చింది. సీఎం కేసీఆర్ ధన్యవాదాలు. ఎర్రవల్లిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో గ్రామ స్వరూపమే మారిపోయింది.
భాగ్య, సర్పంచ్, ఎర్రవల్లి
అందరి సహకారంతోనే..
గ్రామస్తుల సమష్టి కృషితో ఎర్రవలి రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో నిలువడం ఎంతో ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ స్ఫూర్తి, గ్రామస్తుల ఐక్యతతో ఎర్రవల్లిని బంగారవల్లిగా మార్చుకున్నాం. ప్రభు త్వ పథకాలు, అభివృద్ధి పనులను గ్రామ స్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. మొక్కల సంరక్షణలో గ్రామస్తులు బాధ్యత తీసు కున్నారు. ఫలితంగా వంద శాతం మొక్కలు మంచిగున్నాయ్.. పచ్చదనం పెరిగింది. గ్రామంలో సీసీ రోడ్లకు ఇరువైపులా మొక్కలను సంరక్షిస్తున్నాం. ఎర్రవల్లి ప్రగతివల్లిగా దేశంలోనే పేరు ప్రఖ్యాతి గాం చింది. అన్ని రంగాల్లో ఎర్రవల్లి ఆదర్శంగా నిలిచింది.
సిద్ధేశ్వర్, గ్రామ కార్యదర్శి