మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 3: మెదక్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న లాక్డౌన్ సోమవారానికి ఆరో రోజు చేరుకున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పట్టణ ప్రజలు కరోనా నేపథ్యంలో అవసరమైతేనే బయటకు వస్తున్నారు. దీంతో రోడ్లపై జన సంచారం తగ్గింది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, పాలకవర్గ సభ్యులు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
5 నుంచి పూర్తి స్థాయి లాక్డౌన్
పెద్దశంకరంపేట, మే 3: మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా పెద్దశంకరంపేటలో ఈనెల 5 నుంచి పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు ఎంపీపీ జంగం శ్రీనివాస్, తహసీల్దార్ చరన్సింగ్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 5 నుంచి 13 వరకు కిరాణాషాపులతో సహ అన్ని దుకాణాలు మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని ప్రజలు నిత్యావసర, సరుకులు మంగళవారం ఒక్కరోజే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ అత్యవసరమైతేనే బయటకు రావాలని మాస్క్లు ధరించి భౌతిక దూ రం పాటించాలన్నారు. కూరగాయలు, పండ్లు, పాలు, చికెన్ వ్యాపారులు ఉద యం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తెరచిఉంచాలన్నారు. ప్రజా శ్రేయ స్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని లాక్డౌన్ నిబంధనలను ప్రజలు సహకరించాలన్నారు. నిబంధనలు అతిక్రమి స్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సర్పంచ్ సత్యనారాయ ణ, ఎంపీటీసీ సుభాశ్గౌడ్, రైతుబంధు మండల అధ్యక్షుడు సురేశ్గౌడ్, ఎంపీడీవో రామ్నారాయణ, ఆర్ఐ ప్రభాకర్, వీఆర్వో శ్రీనివాస్రావు, తదితరులుపాల్గొన్నారు.
కొనసాగుతున్న లాక్డౌన్
కరోనా నియంత్రణకు పది రోజులుగా మండలంలో లాక్డౌన్ కొనసాగుతున్నది. సోమవారం లాక్డౌన్ కొనసాగుతుండటంతో ప్రజలు బయట తిరుగలేదు. మండలంలో సుమారు 300కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో లాక్డౌన్ విధించారు. నిత్యావసర సరుకులు మధ్యాహ్నం 1 గంట వరకు మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటించి తీసుకున్నారు. ప్రజలు, వాహనాలు తిరుగకపోవడంతో నాందేడ్- అకోలా జాతీయ రహదారి వెలవెలబోయింది.
మంబోజిపల్లిలో …
మెదక్రూరల్ , మే 3: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. సోమవారం మెదక్ మండలంలోని మంబోజిపల్లిలో వ్యాపార ,వాణిజ్య సముదాయలు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచారు. మధ్నాహ్నం 2 నుంచి అత్యవసరమైన సేవలు మినహా అన్నిరకాల వ్యాపార సంస్థలు, దుకాణాలు స్వచ్ఛంద మూసివేయండతో జనసంచారం లేక ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది.