వర్గల్, ఫిబ్రవరి 5 : కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా శుక్రవారం సంగారెడ్డి కెనాల్ ఆఫ్టేక్ తూం వద్ద వదిలిన గోదావరి జలాలు రెండు రోజుల్లో సిద్దిపేట జిల్లా సరిహద్దులు దాటి మెదక్ జిల్లాలో ప్రవేశించాయి. మండలంలోని చౌదర్పల్లి బంధంచెరువు, వర్గల్పెద్ద చెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్పేట ఖాన్చెరువులను దాటి హల్దీవాగులోకి ప్రవేశించి, నాచారంగుట్ట లక్ష్మీరసింహస్వామి పాదాలు తాకి ఏడుపాయల వనదుర్గామాత చెంతకు పయణమయ్యాయి. వరుసగా మూడోసారి నీళ్లను వదలడంతో చెరువులు, హల్దీవాగు పరీవాహక ప్రాంతాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..
సీఎం కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో దుబ్బాక నియోజకవర్గం రైతులకు వరంగా మారిందని అల్వా ల సర్పంచ్ ఎనగంటి కిష్టయ్య అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో ఈ నెల 4న ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కొడకండ్ల వద్ద వదిలిన గోదావరి జలాలు కూడవెల్లి వాగులో ఆదివారం అల్వాల మీదుగా మిరుదొడ్డి నుంచి దిగువకు ప్రవహిస్తున్నది. ఈ సందర్భంగా కూడవెల్లి వాగులో అల్వాల చెక్డ్యామ్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు.