గజ్వేల్ అర్బన్, డిసెంబర్ 10 : కార్తిక ద్వాదశిని పురస్కరించుకుని వనభోజనాల్లో భాగంగా గజ్వేల్ సంతోషి పరిషత్ సభ్యులు గజ్వేల్ నుంచి కోమటిబండ ఉమాసంగమేశ్వరాలయానికి పాదయాత్రగా వెళ్లారు. ఆదివారం గజ్వేల్ సంతోషి పరిషత్ ఆధ్వర్యంలో కోమటిబండ మిషన్ భగీరథ సంప్హౌస్ గుట్టపై ఉన్న ఉమా సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద కార్త్తిక వనభోజనాలు నిర్వహించారు.
గజ్వేల్ సంతోషిమాత ఆలయం నుంచి కోమటిబండ ఉమా సంగమేశ్వర ఆలయానికి నడిచివెళ్లారు. ము న్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి పాదయాత్రను ప్రారంభించారు. హరేరామ నామసంకీర్తనతో పాదయాత్ర ముందుకు సాగింది. పురోహితులు దేశపతి రాజశేఖరశర్మ వైదిక నిర్వహణలో గంగాహారతి, కార్తిక వనభోజనాలు చేశారు. సర్పంచ్ తూం శేఖర్పటేల్, గజ్వేల్ పట్టణంతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.