తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
జై కేసీఆర్.. జైజై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మసీదు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామాల్లో పలుచోట్ల మొక్కలు నాటారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ, వివిధ గ్రామాల్లో ప్రజలకు అన్నదానం చేశారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు అభివృద్ధిలో మన రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు. రాజకీయలకతీతంగా సంక్షేమ పథకాలు అందించి ప్రజల మనస్సు గెలుచుకున్న ప్రజా నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
– సిద్దిపేట జిల్లా నెట్వర్క్, ఫిబ్రవరి 17