ప్రజాసంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట
పల్లెప్రగతితో కళకళలాడుతున్న గ్రామాలు
కల్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం
గంజాయి సాగు చేస్తే సంక్షేమ పథకాలు రద్దు
నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి
కల్హేర్ మండల పరిధిలో రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపనలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
కల్హేర్, ఫిబ్రవరి 8 : కష్టకాలంలో సీఎం కేసీఆర్ ఆదుకుంటారని, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రజలు పూర్తి భరోసాతో ఉన్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఖానాపూర్ కే, జమ్లా తండా, బీబీపేట్, ఫత్తేపూర్, ఇందిరానగర్, పొమ్యానాయక్ తండా, కల్హేర్, మాసాన్పల్లి, మహాదేవుపల్లి, దేవునిపల్లి, బాచేపల్లి, మీర్కాన్పేట్, ఖానాపూర్ బి, కాల్వోని కుంట తండా, బల్కంచెల్క తండా, దామరచెరువు, మునిగేపల్లి, మొదళ్లకుంట తండా, నాగ్దర్, అలీఖాన్పల్లి, కృష్ణాపూర్ గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన సీసీరోడ్ల నిర్మాణం పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే, 25 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను గత ప్రభుత్వాలు కానీ, కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కానీ అమలు చేయడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల్లో వీధులన్నీ కంపుకొట్టేవని, కానీ, పల్లెప్రగతితో నేడు పల్లెలన్నీ కళకళలాడుతున్నాయని కొనియాడారు. ఆడబిడ్డకు కానుకగా కల్యాణలక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ అందిస్తున్న రూ. లక్ష 116లతో తల్లిదండ్రుల్లో కూతురి పెండ్లి రందిలేకుండా పోయిందని అన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్, పార్టీ మండల అధ్యక్షుడు రాంసింగ్, జడ్పీటీసీ నర్సింహరెడ్డి, ఎంపీపీ గుర్రపు సుశీల, ఎంపీపీ ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, తహసీల్దార్ జైరాం, ఎంపీడీవో మంజుల, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అలీ, ఎంపీవో శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల స్థాయి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
యువత మత్తు వీడాలి : ఎమ్మెల్యే
కల్హేర్ : యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాదని, దీంతో తల్లిదండ్రులు పుట్టెడు దుఖఃంలో ముగినిపోతున్నారని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. అందుకోసమే సీఎం కేసీఆర్ మాదక ద్రవ్యాలు, గంజాయిని నిర్మూలించేందుకు పూనుకున్నారని తెలిపా రు. మంగళవారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, గంజా యి సాగు చేస్తే ప్రభుత్వం అందిం చే సంక్షేమ పథకాలతో పాటు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయిని సాగు చేసే వారి వివరాలను అధికారులకు అందించాలన్నారు. దేశానికి వెన్నెముక లాంటి యువత సన్మార్గంలో పయనించి, ప్రపంచ దేశాలకు పోటీగా అన్ని రంగాల్లో రాణించి దేశ ప్రతిష్టను పెంపొందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జైరాం, ఎంపీడీవో మంజుల, నారాయణఖేడ్ ఎక్సైజ్ ఎస్సైరవి, ప్రజా ప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.