మెదక్ అర్బన్/ నర్సాపూర్, జూన్ 10 : కోర్టు కేసుల్లో రాజీతో ఇరువర్గాలకు న్యాయం జరురుతుందని జిల్లా ప్రధా న న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్నచిన్న గొడవలకు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోవద్దన్నారు. శనివారం జరిగిన లోక్ అదాలత్ లో 224 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఎంఈవోపీ కేసుల్లో రూ.29,20,000 నష్టపరిహారం బాధితులకు చెల్లించారు. ఎలక్ట్రిసిటీ కేసుల్లో రూ.11000 రికవరీ చేశామన్నా రు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జితేందర్, జూనియర్ సివిల్ న్యాయమూర్తి రీటాలాల్చంద్, స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ కల్పన, సెకండ్ క్లాస్ మేజిస్ట్రెట్లు సిద్ధ్దయ్య, స్వాతి, న్యాయవాదులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవాలి
నర్సాపూర్ కోర్టులో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి, జూనియర్ సివిల్ జడ్జి అనిత మాట్లాడారు. కక్షిదారులు పంతాలకు పోకుండా చిన్నచిన్న తగాదాలను కోర్టు చుట్టు తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా లోక్అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకోవాలన్నారు. ఓఎస్ 7/2001 కేసులో 23 ఏండ్ల పార్టీషన్ సూట్ సివిల్ కేస్లో భూతగాదాను ఇరువర్గాలు రాజీపడి పరిష్కరించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్సై శివకుమార్, సీనియర్ న్యాయవాదులు ఎండీ జాఫర్, ఖాజా మొయినుద్దీన్, న్యాయవాదులు, బ్యాంక్ మేనేజర్స్, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.