రామాయంపేట/ నిజాంపేట, జనవరి 25 : రామాయంపేట పట్టణంలోని మైనార్టీ రుణాల కోసం దఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యులను నిర్వహించినట్లు ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో 24 మంది లబ్ధ్దిదారులకు గాను 16 మంది ఇంటర్య్యూకు హాజరైనట్లు, మిగతా 8 మందికి కూడాఇంటర్వ్యూ నిర్వహిస్తామని ఎంపీడీవో వివరించారు. ఇంటర్వూలకు పట్టణంలో ఉన్న బ్యాంకులతోపాటు లక్ష్మాపూర్ ఏపీజీవీబీ బ్యాంకు అధికారులు హాజరయ్యారు. అర్హులకు తక్కువ వడ్డీపై రుణాలు ఇస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు.
నిజాంపేటలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మైనార్టీ కార్పొరేషన్ రుణాలు పొందడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 92 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇంటర్వ్యూకు 76 మంది హాజరైనట్లు ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, ఇన్చార్జి ఎంపీడీవో రాజేందర్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీజీవీబీ మేనేజర్ మురళీకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్,సెంట్రల్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నర్సయ్య, జూనియర్ అసిస్టెంట్ వినయ్కుమార్ పాల్గొన్నారు.