గజ్వేల్, ఏప్రిల్ 28: లక్ష్యం… ప్లాస్టిక్హ్రిత గ్రామం… భవిష్యత్ తరాలకు హానికరమైన ప్లాస్టిక్తో పెను ప్రమాదం సంభవించకూడదనే ఉద్దేశంతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి కేబీఆర్ ఫౌండేషన్ ప్రశంసలు అందుకుంటున్నది. గ్రామంలోని వీధులు, ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్తో క్యాన్సర్ వంటి రోగాల బారిన గ్రామస్తులు పడకూడదనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
ప్లాస్టిక్పై అవగాహన
ములుగు మండలం క్షీరసాగర్ గ్రామానికి చెందిన కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొన్యాల బాల్రెడ్డి, ఎంపీటీసీ కొన్యాల మమతాబాల్రెడ్డి దంపతులు10కిలోల ప్లాస్టిక్ వస్తువులు తీసుకొచ్చిన వారికి 10 గ్రాముల(తులం) వెండి నాణెం ఇస్తున్నారు. వారం రోజులుగా గ్రామస్తుల్లో ప్లాస్టిక్ వాడకంపై కలిగే అనర్థాలు, ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి రోగాలు, ప్లాస్టిక్ నిర్మూలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై (గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు) గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రచారం చేసిన మరుసటి రోజు నుంచే గ్రామస్తుల్లో అవగాహన ఏర్పడి ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరిస్తున్నారు. ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు నిల్వ చేసుకోకుండా చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటూ స్వచ్ఛందంగా ఫోన్ చేసి ప్లాస్టిక్ను తీసుకొస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే 450కిలోల ప్లాస్టిక్ను సేకరించగా ఇందులో 43 మంది భాగస్వాములయ్యారు. ప్లాస్టిక్హ్రిత గ్రామ నిర్ణయానికి యువత, మహిళలు, ప్రజలు నడుంబిగించి ముందుకు రావడంతో మంచి స్పందన లభిస్తున్నది. గ్రామం ప్లాస్టిక్హ్రితంగా మారితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. అందుకు ప్లాస్టిక్ ఇచ్చిన వారికి వెండి నాణెం ఇస్తున్నారనే ప్రచారంతో ప్రతి ఇంట్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ను తీసుకొస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పడేసిన ప్లాస్టిక్ను గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రామస్తులు సేకరించి వెండి నాణెం బహుమతిగా అందుకుంటున్నారు. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్తో ఎలాంటి ముప్పు కలగకూడదనే ఉద్దేశంతో కేబీఆర్ ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ఈనెల 30 వరకు కొనసాగనుండడంతో లక్ష్యాన్ని చేరుకునేలా గ్రామస్తులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం.
వెండి నాణెం బహూకరణపై ప్రశంసలు
ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి వెండి నాణెం బహుమతిగా అందిస్తున్న కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొన్యాల బాల్రెడ్డిని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశంసిస్తున్నారు. వాట్సాప్, సోషల్మీడియాలో ముమ్మరంగా ప్రచారం కావడంతో అందరి నుంచి అభినందనలు అందుకుంటున్నారు. ప్లాస్టిక్హ్రిత గ్రామం కోసం చేపట్టిన కార్యక్రమాన్ని ముందు రోజు డప్పు చప్పుడుతో ప్రారంభించారు. సోషల్ మీడియాలో డప్పు చాటింపు వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల్లో చర్చ ప్రారంభమైంది. ప్లాస్టిక్పై అందరం కలిసికట్టుగా ముందుకు నడిచి ముందుతరాలకు మంచి చేకూరేలా చూసేందుకు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు.
భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలన్నదే ఉద్దేశం భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. 10కిలోల ప్లాస్టిక్ను తీసుకొస్తే 10గ్రాముల వెండి నాణెం అందజేస్తున్నాం. గ్రామస్తులకు ఎలాంటి హానీ కలుగకూడదనే ఉద్దేశంతో గ్రామంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ను సేకరించేలా అందరిలో అవగాహన వచ్చేలా ప్రచారం చేశాం. వెండినాణెం అందించడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.ప్లాస్టిక్పై ముమ్మరంగా పోరాటం చేసి భవిష్యత్ తరాలకు మంచి జీవితం అందించడంలో అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. నాకు వచ్చిన ఈ ఆలోచన ప్రభుత్వ అధికారులను ఆలోచింపజేస్తున్నది.
– కొన్యాల బాల్రెడ్డి, కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్
ప్లాస్టిక్ తీసుకొచ్చి నాణెం తీసుకున్నాం
గ్రామంలో చెత్త సేకరణ చేసే సమయంలో వీధుల్లో కనిపించే ప్లాస్టిక్ సేకరించి 10 కిలోలకు తులం వెండి నాణెం తీసుకున్నాం. గ్రామ చివర కూడా ప్లాస్టిక్ వస్తువులు లేకుండా తీసుకొస్తున్నాం. వెండి నాణెం ఇస్తున్నారని తెలియడంతో ఇండ్లలో నుంచి డబ్బాలు ఎక్కువగా తీసుకొచ్చి వెండి నాణెం తీసుకుంటున్నారు. ఎక్కడ కనిపించినా గ్రామస్తులు పంచాయతీ వద్దకు పది కిలోల ప్లాస్టిక్ తీసుకొచ్చి వెండి నాణెం తీసుకుంటున్నారు.
– మల్లమ్మ, పంచాయతీ కార్మికురాలు, క్షీరసాగర్, ములుగు మండలం
ఇంట్లో ఉన్న డబ్బాలు తీసుకొస్తున్నారు
ప్లాస్టిక్తో రోగాలు వస్తాయని డప్పు చాటింపు వల్ల తెలుసుకొని ఇంట్లో ఉన్న డబ్బాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బాలు 10కిలోలు తీసుకొస్తే తులం వెండి నాణెం ఇస్తున్నారు. ప్లాస్టిక్ డబ్బాలకు వెండి ఇస్తున్నారని అం దరికీ తెలిసింది. దీంతో వెండి కోసం ఎక్కడ దొరికిన ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లను తీసుకొస్తున్నారు. అందరికీ ఉపయోగపడే పని అంటే అందరూ ముందుకొస్తున్నారు.
– రాములు, క్షీరసాగర్, ములుగు మండలం