గజ్వేల్, ఆగస్టు 18: వాతావరణ మార్పుల నేపథ్యంలో అటవీ, వ్యవసాయ రంగాలను సమన్వయం చేస్తూ సుస్థిర అభివృద్ధికి ఆగ్రోఫారెస్ట్రీని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో సిల్వికల్చర్ అండ్ ఆగ్రోఫారెస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘ైక్లెమేట్ రెడీ ఆగ్రోఫారెస్ట్రీ, ఇంటిగ్రేటింగ్ ఎకాలజీ టెక్నాలజీ అండ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్నోవేషన్(ఎన్సీసీఆర్ఏఎఫ్-26) పేరిట రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ.. ఆగ్రోఫారెస్ట్రీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలంటే పర్యావరణ, సాంకేతిక ఆవిష్కరణలు అనే అంశాల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఆగ్రోఫారెస్ట్రీతో పర్యావరణ పరిరక్షణకు బాటలు వేయాలని, అటవీ-వ్యవసాయ సమన్వయంతో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఆగ్రోఫారెస్ట్రీతోనే వాతావరణ మార్పులకు చెక్ పెట్టవచ్చన్నారు.
ఈ సదస్సులో దేశవ్యాప్తంగా పరిశోధకులు సమర్పించిన 151 పరిశోధనాంశాలతో కూడిన సెక్టార్ అబ్స్రాక్ట్ వాల్యూమ్ను ఆవిష్కరించారు. సీఏఆర్ఈఎస్, ఎఫ్సీఆర్ఐ, నాబార్టు, సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్, సపోలా ఆర్గానిక్స్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా పరిశోధకులు, నిపుణులు, విద్యార్థులు, ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ నోడల్ అధికారి శరవణన్, ప్రియాంక వర్గీస్, సీసీఎఫ్ క్షితిజ, నాబార్డ్ జీఎం గణపతి, అటవీ కళాశాల డీన్ ప్రవీణ, హెచ్వోడీ చిరంజీవరెడ్డి, రీజా సుందరం తదితరులు పాల్గొన్నారు.