వెల్దుర్తి, డిసెంబర్ 21 : పంట మార్పిడితో అధిక లాభా లు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని మాసాయిపేట రైతు వేదికలో ఇతర పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పరశురాంనాయక్ మాట్లాడుతూ ఒకే పం టను సాగు చేయడంతో భూమి నిర్జీవం అవుతుందని, దీంతో దిగుబడులు తగ్గుతాయన్నారు. పంటల మార్పిడితో భూమిలో ఉన్న అన్ని లవణాలు, పోషకాలు, ఖనిజాలు పంటలకు అందుతాయని, దీంతో భూసారం హెచ్చుతగ్గులకు లోను అవుతుందన్నారు. వరికి బదులుగా పప్పుదినుసులైన కందులు, మినుములు, పెసర్లతోపాటు నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, జొన్నలు, పత్తి, కూరగాయల పంటలు సాగు చేయాలని సూచించారు. వెల్దుర్తి మండలం బండపోసాన్పల్లి, శెట్పల్లి, ఉప్పులింగాపూర్ గ్రామాల్లో ఇతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. సమావేశంలో వెల్దుర్తి, మాసాయిపేట తహసీల్దార్లు సురేశ్, మాలతి, ఏవోలు మాలతి, రాజశేఖర్, మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్రెడ్డి, ఏఈవోలు పాల్గొన్నారు.
డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి..
పంట మా ర్పిడితో భూసారం పెరుగుతుందని, అంతేకాకుండా ఆరుతడి పంటలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్ రైతులకు సూచించారు. చేగుంట మండలం చందాయిపేట రైతు వేదికలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్, ఏడీఏ వసంతసుగుణ, రైతుబంధు జిల్లా కో-ఆర్డినేటర్ మోహన్రెడ్డి, మండల కో-ఆర్డినేటర్ శ్రీను, తహసీల్దార్ విజయలక్ష్మి, సర్పంచ్ స్వర్ణలత, అధికాలు పాల్గొన్నారు.
మనోహరాబాద్లో…
ఆరుతడి పంటలతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఏవో ప్రవీణ అన్నారు. శివ్వంపేట మండలం ఏదుల్లాపూర్లో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. రైతులు యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలైన పెసర, మినుము, పొద్దుతిరుగుడు, వేరుశనగ వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్లూరి కీర్తన హన్మంతరావు, ఉపసర్పంచ్ పాండురంగం, ఏఈవో సుభాశ్, రైతులు పాల్గొన్నారు.
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి..
యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని తహసీల్దార్ సహదేవ్, ఏడీఏ బాబూనాయక్ సూచించారు. మంగళవారం మండలంలోని సోమక్కపేట గ్రామంలో వారు పర్యటించి వేరుశనగ పంటను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ యాసంగిలో వేరుశనుగ, శనగ, పొద్దుతిరుగుడు, పెసరతోపాటు కూరగాయల పంటలు సాగు చేయాలని తెలిపారు. అదేవిధంగా రైతులు తమ పంటల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. వారి వెంట సర్పంచ్ స్రవంతీలక్ష్మణ్, ఏఈవో స్రవంతి, రైతులు ఉన్నారు.
కొల్చారంలో..
యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖర్రావు రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్పల్లి గ్రామాల్లో వ్యవసాయాధికారి బాల్రెడ్డితో కలిసి పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో పొద్దుతిరుగుడు, వేరుశనగ, శనగ, కుసుమ, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. ఆరుతడి పంటల యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఈవో ప్రతిభ, రైతులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి..
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని డిప్యూటీ తహసీల్దార్ సంతోశ్ రైతులకు సూచించారు. మండలలోని ఘన్పూర్, అల్లాపూర్, ఇమాంపూర్ గ్రామా ల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఉపసర్పంచ్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
నిజాంపేటలో..
యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి సతీశ్ రైతులకు సూచించారు. మంగళవారం రజాక్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో ఆరుతడి పంటలైన వేరుశనగ, శనగ, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేయాలని సూచించారు. కొత్తగా భూపట్టాదారు పాసు పుస్తకం వచ్చినవారు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రజాక్పల్లి సర్పంచ్ సునీత, రైతులు పాల్గొన్నారు.