మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్, జనవరి 8 : జిల్లా కేంద్రం మెదక్లోని రేణుకాఎల్లమ్మ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన భక్తులు బంగారు ఆభరణాలను బహూక రించారు. అమెరికాలో ఉంటున్న బండారు నితిన్గౌడ్, మధుశ్రీ దంపతుల కుమారుడు వాహిన్గౌడ్ రూ.4 లక్షల విలువచేసే బంగారు పాదుకలు, చేతులు, తొట్టెలను ఆల య కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కొండన్ సురేందర్రెడ్డి, గౌడ సంఘం పట్ట ణాధ్యక్షుడు గడ్డమీది కృష్ణాగౌడ్, నాయకులు భిక్షపతిగౌడ్, కృష్ణాగౌడ్, వెంకటయ్యగౌడ్, రవీందర్గౌడ్, అమర్నాథ్గౌడ్, అర్చకుడు శ్రీనివాసశర్మ, బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు వేదవ్యాస్ పాల్గొన్నారు.
మల్లన్న క్షేత్రంలో పట్నాలు, బోనాలు
మెదక్ మండలంలోని మంబోజిపల్లి శివారులో కొయ్య గుట్టపై కొలువుదీరిన మల్లికార్జునస్వామి ఆలయం భక్తు లతో కిటకిటలాడింది. పూజారి మల్లన్నస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. గంగరేగు చెట్టు వద్ద పట్నం వేసి, బోనం వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు.
లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం
మండలంలోని కాళ్లకల్గ్రామంలో లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ ఉత్సవాలను ఘ నంగా నిర్వహించారు. సర్పంచ్ మల్లేశ్ ముదిరాజ్, ఎంపీటీసీ లావణ్యాముదిరాజ్ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం, వనభోజనాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ నవనీతారవి ముదిరాజ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
20 నుంచి చిత్తారమ్మ ఉత్సవాలు
పట్టణంలోని చిత్తారమ్మ ఆలయంలో ఈ నెల 20 నుంచి 23 వరకు 13వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చిత్తారమ్మ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు వార్షికోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. 13ఏండ్లుగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు
రామాయంపేటలోని రాములవారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి భక్తులు దీపాలంకరణ చేశారు. మహిళలు రాములవారికి అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పండితుడు కూర్మాచలం శ్రీనివాసచారి, ఆల య కమిటీ చైర్మన్ చంద్రపు కొండల్రెడ్డి పాల్గొన్నారు.
ఆలయ పూజారికి సన్మానం
రామాయంపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి వెంకటరమణాచార్యులను భక్తులు సన్మానించారు. ఆల యంలో నెల రోజులుగా ధనుర్మాస ఉత్సవాలను నిర్వహి స్తున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మీపతి, సభ్యులు లక్ష్మణ్, సంతోష్, రవీందర్, అశోక్ ఉన్నారు.
లక్ష్మీనర్సింహస్వామికి అభిషేకాలు
మండలంలోని సికింద్లాపూర్ గ్రామంలో స్వయంభు లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన పూజారి ధనుంజయశర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ దండెపు విఠల్ సోదరుడు సతీశ్ కుటుంబ సభ్యు లు, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల్ మహిపాల్రెడ్డి తదితరులు లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఈవో శశిధర్, అర్చకులు విద్యాకర్చారి, జూనియర్ అసిస్టెంట్ నర్సింహారెడ్డి ఉన్నారు.
కాళీమాత ఆలయంలో అన్నదానం
మండలంలోని మన్నెవారి జలాల్పూర్లో వెల్దురి -నర్సాపూర్ ప్రధాన రోడ్డు పక్కన నిర్మించనున్న కాళీమాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుడు ప్రతాపనారాయణశర్మ కాళీమాత ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, విశేషాలంకరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు విఠల్స్వామి మాట్లాడుతూ.. కాళీమాత ఆలయాన్ని నిర్మించి, భక్తుల సహకారంతో కాళీమాత విగ్రహాలను ప్రతిష్ఠిస్తా మన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.