జహీరాబాద్, డిసెంబర్ 15: గోవాకు చెందిన మద్యాన్ని అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నట్లుసంగారెడ్డి ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అశోక్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గురువారం 65వ జాతీయ రహదారిపై రాష్ట్ర సరిహద్దులో ఉన్న చిరాగ్పల్లిలోని ఎక్సైజ్ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేయగా, గోవా మద్యం లభించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇతర రాష్ర్టాల మద్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారనే సమాచారంతో ట్రావెల్స్ బస్సులు, వాహనాలు తనిఖీలు చేసినట్లు తెలిపారు.
గోవాలో మద్యం తక్కువ ధరలకు లభించడంతో తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ట్లు తెలిపారు. ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 26 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందన్నారు. ట్రావెల్స్ బస్సులో మద్యం ఎవరు తరలించారు, ఎక్కడికి తీసుకుపోతున్నా రు అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. దాడులో ఎక్సైజ్ సీఐలు సాయన్న, అశోక్, రమేశ్, అరిక, పృథ్వీరాజుతో పాటు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.