మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 6: ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తేనే వారిలోని ఆలోచనలే ఆవిష్కరణలకు పునాదులవుతాయని స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ రాష్ట్ర పరిశీలకురాలు గీతాంజలి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2022లో భాగంగా ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, పాఠశాల విద్యాశాఖ ఆధ్వ ర్యంలో మూడు సంవత్సరాలుగా స్కూల్ ఇన్నోవేషన్ ఛా లెంజ్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అన్ని పాఠశాలల్లోని ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు.
విద్యార్థులను గ్రూపులుగా ఏర్పాటు చేసి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వబడుతున్నదన్నారు. శిక్షణ పూర్తై న తరువాత విద్యార్థుల ఐడియాలను ఆన్లైన్లో పంపినైట్లెతే ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి జిల్లా స్థాయిలో ఆ తరువాత రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొనడానికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఉత్తమమైన ప్రాజెక్టులను ఎంపిక చేసి వారికి పేటెంట్ హోదాను కల్పిండం జరుగుతుందన్నారు.
ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకునే విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలే విభిన్న ఆవిష్కరణలకు కారణమవుతాయ్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ టీమ్ సభ్యులు పూజ, ప్రియాంకతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.