మెదక్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఆడపిల్లలపై వివక్షను రూపుమాపాలని, బాల్యవివాహాలను అరికట్టాలని, అందుకు ప్రతిఒకరూ కంకణబద్ధులై ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆడపిల్లలను రక్షించడం, చదివించడం వల్ల సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా ఆడపిల్లలు వివక్షకు గురవుతున్నారని, ఈ జాఢ్యాన్ని రూపుమాపాలంటే ముందు కుటుంబ వ్యవస్థలో మార్పురావాలన్నారు. అమ్మాయిలు ధైర్యంగా సమస్యలను ఎదురొని, బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. పాఠశాలలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన, ప్రతి అంశంపై చర్చించగలిగే ధైర్యం ఉండాలన్నారు.
అమ్మాయిలు తమ స్నేహితులు లేదా తోటి వారు సమస్యల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదురొనేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు. అధికారులు, ఎన్జీవోలు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి సమస్యలు పరిషరించాలని, అమ్మాయిలను గర్భస్థ శిశువు నుంచి కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించి, బేటీ బచావో- బేటీ పడావో పోస్టర్ను ఆవిషరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఈవో రాధాకిషన్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, డీడబ్ల్యూవో బ్రహ్మాజీ, మెప్మా పీడీ ఇందిరా, సూపర్వైజర్లు, చైల్డ్లైన్ కోఆర్డినేటర్లు, వివిధ బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.