సంగారెడ్డి, డిసెంబర్ 12 : ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను సుందరీకరించేందుకు చేపట్టిన ‘మనఊరు-మనబడి’ కింద చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ చైర్పర్సన్ చాంబర్లో ఉదయం 10 గంటలకు 2వ స్థాయీ సంఘం(గ్రామీణాభివృద్ధి)పై సమావేశాన్ని జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్లయ్య ప్రారంభించారు.ఉదయం 12 గంటలకు 4వ స్థాయీ సంఘం (విద్య-వైద్యం), మధ్యాహ్నం 2.30గంటలకు 1వ స్థాయీ సంఘం(ఆర్థిక, ప్రణాళిక), సాయంత్రం 3.30 గంటలకు 7వ స్థాయీ సంఘం(పనులు) అంశాలపై సభ్యుల అభ్యంతరాలను అధికారులకు వివరించారు. సమావేశాలల్లో జడ్పీటీసీలు రాఘవరెడ్డి, కుమార్గౌడ్, కొండల్రెడ్డి, రమేశ్, ఆంజనేయులు, నర్సింహారెడ్డితోపాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.