రామాయంపేట, ఫిబ్రవరి 21: మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. బుధవారం హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్వగృహంలో ఆయన సమక్షంలో రామాయంపేటకు చెందిన కౌన్సిలర్లు దేమె యాదగిరి(6వ వార్డు), చిలుక గంగాధర్ (11వ వార్డు), దేవుని జయరాజు (9వ వార్డు), సుందర్సింగ్ (2వ వార్డు) కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారితోపాటు చిన్నశంకరంపేట మండలం శేరిపల్లి మాజీ సర్పంచ్ కృష్ణాగౌడ్ చేరారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, మాజీ ఎంపీపీ రమేశ్రెడ్డి, రాంచందర్గౌడ్, పిట్ల ప్రకాశ్, మేడి గణేశ్ తదితరులు ఉన్నారు.