సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 28: నిత్యం చదువుల్లో బిజీబిజీగా ఉండే విద్యార్థినులు వంటకాల్లోనూ నంబర్ వన్ అంటూ తమకు నచ్చిన వంటకాలు తయారు చేసి, ప్రదర్శించారు. శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.
కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు తెలంగాణ సంప్రదాయ వంటకాలు స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.