శివ్వంపేట, ఫిబ్రవరి 27 : దేశంలోని అత్యంత శక్తివంతమైన పీఠాల్లో ఒకటైన బగలాముఖి శక్తిపీఠం ప్రథమ వార్షికోత్సవాన్ని బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు శివ్వంపేటలో ఆలయ ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు శక్తిపీఠం ట్రస్టు సభ్యుడు శివకుమార్గౌడ్, జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా తెలిపారు.
మొదటిరోజు ఉద యం జ్యోతి ప్రజ్వలన, గోపూజ, గణపతిపూజ, పుణ్యాహవచనం, ప్రధాన దేవస్థాపన, అగ్నిప్రతిష్ఠ, లక్ష హరిద్రార్చన, మహామంగళ నీరాజనం, అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకీసేవ జరుగుతాయన్నారు. రెండోరోజు 108 కలశస్థాపన, కలశ జలాలతో మహాభిషేకం, సహస్త్ర పుష్పసహిత హరిద్రార్చన, పూర్ణాహుతి, మహామంగళనీరాజనం, భక్తులకు అన్నదానం ఉంటుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులంతా అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనుగ్రహం పొందాలని కోరారు.