మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 9 : తారురోడ్లపై కేజ్వీల్స్ ట్రాక్టర్లు నడపడంతో రోడ్డు దెబ్బతింటాయని, ఈ నేపథ్యం లో రోడ్ల రక్షణకు కేజ్వీల్స్కు ఇనుప పట్టీలను ఉపయోగించాలని జిల్లా రవాణాధికారి శ్రీనివాస్గౌడ్ కేజ్వీల్స్ తయారీదారులకు సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రం మెదక్లోని కేజ్వీల్స్ తయారీదారుల వద్దకు డీటీవో స్వయంగా వెళ్లి జరుగుతున్న నష్టాలను వివరించారు. రోడ్లపై కేజీవీల్స్(ఇనుప చక్రాలు) ట్రాక్టర్లు నడపడంతో రోడ్లు పూర్తి గా దెబ్బతింటున్నాయన్నారు.
నిబంధనలు ప్రకారం పొలం దగ్గరకు వెళ్లిన తర్వాత ట్రాక్టర్లకు కేజ్వీల్స్ ఎక్కించి దున్నాలని, ఆ తరువాత తొలిగించాలని సూచించారు. కానీ, ట్రాక్టర్ డ్రైవర్లు కేజ్వీల్స్ అలాగే ఉంచి రోడ్లపై వెళ్తుడడంతో రోడ్లు ధ్వం సమవుతున్నట్లు వివరించారు. కేజ్వీల్స్కు ఇనుప పట్టీలు అమర్చితే రోడ్లు దెబ్బతినకుండా ఉం టుందన్నారు. తయారీదారులు తప్పకుండా కేజ్వీల్స్కు రక్షణగా ఇసుప పట్టీలను అమర్చాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీటీవో హెచ్చరించారు. ఇసుప పట్టీలు అమర్చకుండా కేజ్వీల్స్తో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధించడంతోపాటు ట్రాక్టర్ను జప్తు చేస్తామని జిల్లా రవాణాధికారి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. ఆయన రవాణాశాఖ కార్యాలయ సిబ్బంది సందీప్ ఉన్నారు.