సిద్దిపేట, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూ రు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులు, తోటలను శుక్రవారం ఆయన ఆయిల్ఫెడ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అన్ని వసతులతో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని నంగునూరు మండలం నర్మెటలో (రూ.300 కోట్లు) నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు రిఫైనరీని పెట్టి ఫైనల్ ప్రొడక్ట్ను ఇకడి నుంచే నేరుగా మా రెట్లోకి పంపిస్తామన్నారు. వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వా రా రీసైకిల్ చేసే పద్ధతిని కూడా మొదలుపెట్టినట్లు తెలిపారు.ఫ్యాక్టరీ పూర్తి కావడానికి సంవత్సరం పడుతుందని, జూన్ నుంచి రైతుల పంటను కొనుగోలు చేస్తారని, ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. రైతుల వద్ద పంట కొనుగోలు చేసిన తర్వాత ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అధికారులే ఆశ్వరావుపేటకు తీసుకువెళ్లి అక్కడ ప్రాసెస్ చేస్తారన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, రెండు రోజుల్లోగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమఅవుతాయన్నారు. సంవత్సరంలోగా ఫ్యాక్టరీ పనులు పూర్తి చేసుకొని ఇక్కడనే రిఫైనరీ ద్వారా నూనె ఉత్పత్తిని చేసుకుంటామని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఆయిల్ పామ్ మెట్రిక్ టన్నుకు రూ.15 వేల కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయిల్పామ్పై కేంద్ర ప్రభుత్వం ఇంపోర్టు డ్యూటీని తగ్గించడంతో విదేశాల నుంచి మన దేశానికి పెద్ద మొత్తంలో నూనె దిగుమతి అవుతోందన్నారు. దీని ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నామని చెప్పారు.ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్పై సెస్ విధిస్తే మన రైతుల ఆయిల్పామ్కు ధర పెరిగి లాభం చేకూరుతుందన్నారు. కేంద్రం వెంటనే సెస్ విధించాలన్నారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ జీఎం సుధాకర్రెడ్డి, జడ్పీటీసీ తడిసిన ఉమావెంకట్రెడ్డి, నాయకులు జాప శ్రీకాంత్రెడ్డి, ఎడ్ల సోంరెడ్డి, రమేశ్గౌడ్, రాగుల సారయ్య, కృష్టారెడ్డి, పురేందర్, నాగిరెడ్డి, అజ్జి, ఏఈవో గీత, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.