మెదక్ రూరల్ : దేశానికి వెన్నముక రైతన్నకు పారదర్శకంగా సేవలు అందించాలని స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి ( Special Officer Vijayalakshmi ) అధికారులకు సూచించారు. హవేలీ ఘనపూర్ మండలంలో ఆమె ఆగ్రోస్ ( Agros ) రైతు సేవా కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు , ఇతర వ్యవసాయ అవసరాలు సమయానికి అందుతున్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్రంలోని రికార్డులు, స్టాక్, సరుకు నిల్వల వివరాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సామగ్రి సరిపడా నిల్వ ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో స్థానిక ఎంఆర్వో సింధు రేణుక , మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి ఉన్నారు. రైతులకు ఎలాంటి సందేహాలు , సమస్యలు ఉన్నా వ్యవసాయం అధికారులను సంప్రదించాలని సూచించారు.