పటాన్చెరు, డిసెంబర్ 24: ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఆరోగ్యవంతుడని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏపీఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5కే రన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరయ్యారు. ఏపీఆర్ కాలనీల్లోని ప్రజలు, కస్టమర్లు 5కే రన్లో పెద్దఎత్తున పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచమంతా కోల్పోతున్న ఆరోగ్యాలను కాపాడుకునే పనిలో ఉన్నారన్నారు. కరోనా వైరస్ మనకు అనేక ఆరోగ్యపాఠాలు నేర్పిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండేందుకు నడక, జాగింగ్, క్రీడలు, యోగా చేయాలని సూచించారు. ప్రజలందరూ మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఏపీఆర్ సంస్థ నమ్మకమైన వ్యాపారానికి చిరునామా అని ఎమ్మెల్యే అన్నారు. ఆ సంస్థ ప్రజాప్రయోజకర, ఆరోగ్యకర కార్యక్రమాలు నిర్వహించడాన్ని అభినందించారు. సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎండీ సంజీవరెడ్డి అందరిలో ఆర్యోగ స్ఫూర్తిని నింపేందుకు 5కే రన్ నిర్వహిస్తుండటం స్ఫూర్తిదాయకమన్నారు. సంస్థ చేసే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఏపీఆర్ ప్రవీన్స్ హైరియా మోడల్ ఫ్లాట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అందరిలో ఫిట్నెస్ స్ఫూర్తి నింపేందుకు5కే రన్.. చైర్మన్ ఆవుల కృష్ణారెడ్డి, ఏపీఆర్ గ్రూప్
అందరిలో ఫిట్నెస్ స్ఫూర్తిని నింపేందుకు 5కే రన్ను నిర్వహించామని ఏపీఆర్ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు. ఏపీఆర్ సంస్థ కార్యదక్షతకు, నాణ్యమైన వ్యాపార దక్షతకు నిదర్శనమన్నారు. 5కే రన్ పోటీలకు మా కాలనీల్లో ఉన్న కస్టమర్లు పోటీపడి వచ్చారన్నారు. వారందరి ఉత్సాహంతో ప్రతి ఏడాది ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతున్నదన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ సహకారం మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆవుల ప్రవీణ్రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.