గజ్వేల్అర్బన్, ఫిబ్రవరి 13: ప్రమాదాలు, అనారోగ్యంతో ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడేందుకు ఆరోగ్య వంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఏసీపీ రమేశ్ అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్లో ఆపన్నహస్తం మిత్రబృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఎమ్మెల్సీ యాదవరెడ్డి శిబిరాన్ని ప్రారంభించగా, ఏసీపీ రమేశ్ రక్తదానం చేశారు. మొత్తం 50 యూనిట్ల రక్తాన్ని సేకరించి సిద్దిపేటలోని ప్రభుత్వ బ్లడ్బ్యాంక్ అధికారులకు అప్పగించారు. కార్యక్రమంలో ఆపన్నహస్తం మిత్రబృందం అధ్యక్షుడు బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షుడు మంగళిసాయి, సభ్యులు కొలిచెలిమి స్వామి, సత్యనారాయణ, కృష్ణ, శ్రీకాంత్, గిరిబాబు, అరవింద్, గణేశ్, రఘు, రాణి, శిరీష, వాట్సాప్ గ్రూపుల సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.