తొమ్మిదేళ్లలో రాష్ట్రం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి అండగా నిలవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోరారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం న్యామతాబాద్ గ్రామ శివారులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికి రోల్ మాడల్గా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. విద్య, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలిపారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో సాగు నీటిని అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని, మరోసారి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా దీవించాలని కోరారు.
న్యాల్కల్, మే 31: తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి అండగా నిలవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోరారు. బుధవారం మండలంలోని న్యామతాబాద్ గ్రామ శివారులోని సన్రైజ్ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను భారీ గజమాలతో సత్కారించారు. గంగ్వార్ చౌరస్తా నుంచి సన్రైజ్ ఫంక్షన్ హాల్ వరకు నాయకులు, కార్యకర్తలు బైక్, కార్ల ర్యాలీతో ఊరేగింపుగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ దేశానికి రోల్ మాడల్గా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. రైతు సంక్షేమానికి ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా పథకాలతో కృషి చేస్తున్నారన్నారు.
మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని అందిస్తుందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని, మరోసారి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా దీవించాలని కోరారు. అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. తొమ్మిదేళ్లలో అనేక సంక్షేమ, అభివృద్ధి పనులు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఆత్మీయ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
బీఆర్ఎస్కు అండగా ఉంటాం..
దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్కు అండగా ఉంటామని కర్ణాటక రాష్ట్ర ఖురేషీ సంఘం అధ్యక్షుడు నబీ ఖురేషి అన్నారు. తెలంగాణలోని ఖురేషీలను ఏకతాటిపై తెచ్చి బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఉమకాంత్పాటిల్, జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రవీందర్, రాజ్కుమార్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవికుమార్, సర్పంచులు మారుతీయాదవ్, పీటర్రాజ్, కుతూబుద్దీన్, చంద్రన్న, మహిపాల్, లక్ష్మి, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు షబ్బీర్ఖాన్, ఎంపీటీసీ సలీం, పార్టీ మండల నాయకులు భాస్కర్, పాండు రంగారెడ్డి, పాండు రంగారావు పాటిల్, ఎంఆర్.ప్రవీణ్కుమార్, సంగ్రాంపాటిల్, నిరంజన్రెడ్డి, భూమారెడ్డి, రాజేందర్రెడ్డి, నర్సప్ప, వెంకట్, వెంకట్రెడ్డి, తుక్కారెడ్డి, బక్కారెడ్డి, శివస్వామి, శ్రీపతి, రవికుమార్, మాణిక్రెడ్డి, దేవదాస్, ఎల్లారెడ్డి, సుధాకర్రెడ్డి, మైనార్టీ సెల్ మండల నాయకులు సయ్యద్ షకీల్ హైమద్, గౌసొద్ధీన్, శౌకత్ పాల్గొన్నారు.