మెదక్ మున్సిపాలిటీ/ పాపన్నపేట/ నర్సాపూర్/ కొల్చారం/ వెల్దుర్తి/ రామాయంపేట/ చేగుంట, డిసెంబర్ 3 : అంగవైకల్యం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ్ద చూపించాలని జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్కుమార్ అన్నారు. దివ్యాంగులు దినోత్సవం పురస్కరించుకొని శనివారం మెదక్ జిల్లాకేంద్రంలోని మండల వనరుల కార్యాలయంలో భవిత సెంటర్ దివ్యాంగ విద్యార్థులతో కలిసి దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. వైకల్యం శరీరానికే కానీ.. మేధస్సుకు కాదన్నారు. తల్లిదండ్రులతోపాటు భవిత కేంద్ర సిబ్బంది దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో నీలకంఠం, భవిత సెంటర్ ఉపాధ్యాయురాలు పద్మ పాల్గొన్నారు.
దివ్యాంగులతోపాటు ప్రత్యేకావసరాల పిల్లలను చిన్నచూపు చూడరాదని పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు డు రమావత్ హరిసింగ్ సూచించారు. పాపన్నపేట పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం లో ఐఈఆర్పీ శ్రీనివాస్, టీచర్లు వెంకటేశం, వీరేశం, స్వామి, సుభాశ్, రమేశ్ చౌదరి, శశికుమార్రెడ్డి, మధు పాల్గొన్నారు.
దివ్యాంగులను చిన్నచూపు చూడొద్దని చిన్నశంకరంపేట మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి సూచించారు. చిన్నశంకరంపేటలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఆటల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఐఆర్సీటీ శ్వేత, సీఆర్పీ దామోదర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక విద్యను అందిస్తుందని నర్సాపూర్ మండల విద్యాధికారి బుచ్చానాయక్ పేర్కొన్నారు. నర్సాపూర్ మండల వనరుల కేంద్రం ఆవరణంలోని భవిత కేంద్రంలో దివ్యాంగుల దినోత్సవాన్ని ఎంఈవో బుచ్చానాయ క్ ప్రారంభించారు. దివ్యాంగులకు ప్రత్యేక విద్య కోసం భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగులు ప్రతి రోజూ భవిత కేంద్రానికి వచ్చి చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐఈఆర్పీ స్వరూపరాణి, విద్యార్థులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖర్రావు అన్నారు. కొల్చారం మండల వనరుల కేంద్రంలో దివ్యాంగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు ఎంఈవో నీలంకంఠం, తహసీల్దార్ చంద్రశేఖర్రావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మం డల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ విఠల్ నాయక్, ఉపాధ్యాయులు కనకరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల కల్పనకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడం హర్షనీయమని మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్రెడ్డి అన్నారు. గ్రా మంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వికలాంగుల హక్కుల పో రాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీటీసీ కృష్ణారెడ్డి, సొసైటీ డైరెక్టర్ నర్సింహులు, ఎమ్మార్పీఎస్ నాయకులు యాదగిరి, సిద్ధిరాములుగౌడ్తో కలిసి సర్పంచ్ దివ్యాంగులతో కేక్ కట్చేసి వేడుకలను నిర్వహించారు. దివ్యాంగులకు అన్ని రంగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ వారి జీవనోపాధికి పెద్దపీట వేయాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగరాజు, వీహెచ్పీఎస్ నాయకులు శివరాజు, బాబు, రాములు, శివరాములు, సత్తయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.
రామాయంపేట భవిత కార్యాలయంలో దివ్యాంగులకు ఆటల పోటీలను నిర్వహించారు. ప్రతిభకనబర్చిన దివ్యాంగ విద్యార్థులకు ఎంపీడీవో ఉమాదేవి బహుమతులు అందజేశారు. దివ్యాంగులు తమ లోపాన్ని అనుకూలంగా మల్చుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం సవిత, ఐఈఆర్పీ శ్రీకాంత్, ఎంఐసీలు శ్రీకాంత్, సంతోష్, శంకర్, రాజు, రజిత ఉన్నారు.
ప్రభుత్వం దివ్యాలాంగుల అభివృద్ధికి కృషి చేస్తుందని చేగుంట ఎంపీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. చేగుంటలోజరిగిన కార్యక్రమంలో రిసోర్స్పర్సన్ సౌజన్య, శేఖర్ పాల్గొన్నారు.