రామాయంపేట, ఫిబ్రవరి 1 : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి అంత్యక్రియల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొన్నారు. బుధవారం రామాయంపేట మండ లంలోని అక్కన్నపేట గ్రామానికి చెందిన భూమ మధు మంగ ళవారం రాత్రి చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేటలో కార్యక్రమాలు ముగించుకుని తిరిగి మెదక్ వెళ్తుండగా మార్గమధ్యంలో అక్కన్నపేట గ్రామానికి చేరుకోగానే యువకుడి మృతదేహాన్ని తీసుకొస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడే ఆగిపోయి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడి తల్లి నిర్మల, తండ్రి భూమయ్యను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సా యం అందజేశారు.అంత్యక్రియలయ్యే వరకు ఉన్నారు.
కార్యకర్తకు జడ్పీటీసీ చేయూత
శివ్వంపేట, ఫిబ్రవరి 1 : మండలంలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పిల్లి మధు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా బుధవారం మధును పరామర్శించి, వైద్యచికిత్సకు రూ. 5వేల ఆర్థికసాయం అందజేశారు. పార్టీ కోసం కష్టపడే నాయకులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, నాయకులు నర్సింహరెడ్డి, అంజాగౌడ్, చింతస్వామి, వెంకటేశ్, శివకుమార్ ఉన్నారు.
ఆసరాగా నిలిచిన పూర్వ విద్యార్థులు
రామాయంపేట, ఫిబ్రవరి 1 : స్నేహితుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆర్థికసాయం అందజేసి, ఆసరాగా నిలిచారు. ఝాన్సీలింగాపూర్కు చెందిన శాలిపేట నర్సింహులు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గ్రామంలో ఉన్న స్నేహితులు బుధవారం నర్సింహులను పరామర్శించి, రూ.5వేల ఆర్థికసా యాన్ని అందజేసి, అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఆర్థికసాయం అందజేత
చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 1 : మండలంలోని చందంపేట గ్రామానికి చెందిన వడియారం ఎల్లవ్వ ఇటీవల మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని గంగపుత్ర సంఘం నా యకులు పరామర్శించి, రూ.5750 ఆర్థికసాయం అందజేశా రు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు ఉన్నారు.