వర్గల్, ఫిబ్రవరి14: రైతులకు నీళ్లివ్వకపోతే రాజీవ్ రహదారిని నిర్బంధిస్తామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు నుంచి వెంట నే గోదావరి జలాలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని సంగారెడ్డి లిఫ్ట్ కాల్వ వద్ద డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలి సి ఆయన ధర్నా చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ పంటపొలాలు ఎండిపోతే చూస్తూ ఊరుకోమన్నారు. కొండపోచమ్మసాగ ర్ ప్రాజెక్టు సంగారెడ్డి కాల్వ ద్వా రా 15 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నా రు.
నీటిని వెంటనే విడుదల చే యాలని లేకుంటే రాజీవ్ రహదారిని వేలాదిమంది కార్యకర్తలతో స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఆరుగ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు మినహా ఇతర హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.