జిన్నారం, జూలై 22 : సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజీపల్లిలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. గ్రామంలోని సర్వేనంబర్ 181 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ప్రభుత్వ భూమి లో అక్రమ నిర్మాణాలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
ఈ కథనానికి స్పందించి తహసీల్దార్ ఆంథోని ఆదేశాల మేరకు ఆర్ఐలు శ్రీనివాస్, యాదయ్య ప్ర భుత్వ భూమిలో చేపడుతున్న నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆంథోని మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా సహించేది లేదన్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.