శివ్వంపేట, ఫిబ్రవరి 8: దశ మహావిద్య శ్రీబగలాముఖి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. బగలాముఖి ఉపాసకులు, శక్తిపీఠం ట్రస్టు చైర్మన్ శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో తొలిరోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఉదయం 8గంటలకు వేదపఠనం ద్వారా కార్యక్రమం ప్రారంభమైంది. ద్వజారోహణం, గణపతి పూజ, గౌరీపూజ, ప్రతిష్ఠ కార్యక్రమం, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ, హోమం, అమ్మవారికి మహాపూజ కార్యక్రమాలు చేపట్టారు.
హాజరైన ప్రముఖులు…
పూజా కార్యక్రమాలకు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి దంపతులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి దంపతులు, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, స్థలదాతలు జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా దంపతులు, పబ్బ రమేశ్గుప్తా దంపతులు, ట్రస్టు సభ్యులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్గౌడ్ దంపతులు పాల్గొన్నారు.
వేదఘోషతో పులకించిన శివ్వంపేట…
200 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. శివ్వంపేటలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. సాయంత్రం సంగీత విభావరి నిర్వహించారు. శక్తిపీఠం ట్రస్టు సభ్యులు, జడ్పీటీసీ మహేశ్గుప్తా, హైకోర్టు సీనియర్ న్యా యవాది శివకుమార్గౌడ్, సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్, శాస్ర్తుల పురుషోత్తంశర్మ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. మొదటిరోజు భక్తులకు ఓంసాయి వెంకటరమణ రైస్మిల్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. వేద బ్రాహ్మణులకు హైకోర్టు న్యాయవాది శివకుమార్గౌడ్ అన్నదానం ఏర్పాటు చేశారు. తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, స్థానిక ఎస్సై రవికాంత్రావు ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.
కార్యక్రమంలో విగ్రహదాత పెట్లోల్ల రమాదేవీతిరుపతిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ రాజమణి, జడ్పీ కోఆప్షన్ మన్సూర్, రాష్ట్ర నాయకులు శ్రీధర్గుప్తా, కౌన్సిలర్ అశోక్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, గాలి అనిల్కుమార్, బీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు వీరేశం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఆలయ నిర్మాణం మన అదృష్టం
-రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణలో బగలాముఖి శక్తిపీఠం నిర్మాణం మన అదృష్టం అన్నారు. సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అర్చకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడం హర్షనీయం అన్నారు. బగలాముఖి అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్టు ఆయన చెప్పారు.