సంగారెడ్డి, ఫిబ్రవరి 12: సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో చైర్పర్సన్పై కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు నోటీసును అందజేశారు. సోమవారం కలెక్టరేట్లో 24 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన నోటీసును అదనపు కలెక్టర్కు అందజేశారు. చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి 26 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కావాలని, లేదంటే తీర్మానాం వీగిపోతుందని అదనపు కలెక్టర్ కౌన్సిలర్లకు సూచించారు. ఈ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లే ప్రస్తుత బీఆర్ఎస్ చైర్పర్సన్ను దించేందుకు సిద్ధమయ్యారు. ఈ అవిశ్వాసానికి వైస్ చైర్మన్ లతా హాజరై నోటీసులో సంతకం చేశారు. అవిశ్వాస నోటీసులో సంతకాలు చేసిన వారిలో వైస్ చైర్మన్తో సహా 7వ వార్డు కౌన్సిలర్ బోయిని విజయలక్ష్మి, 16వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్(నాని), 19వ వార్డు కౌన్సిలర్ చాకలి స్వప్న, 25వ వార్డు కౌన్సిలర్ ఆంజూమ్, 37వ వార్డు కౌన్సిలర్ భగవంతల పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ అల్లూరి మణెమ్మ, 13వ వార్డు కౌన్సిలర్ లావణ్య, 3వ వార్డు కౌన్సిలర్ విష్ణువర్ధ్దన్, 18వ వార్డు కౌన్సిలర్ అశ్విన్కుమార్, 26వ వార్డు కౌన్సిలర్ షేక్ సాబేర్, 21వ వార్డు కౌన్సిలర్ మందు రాధాకృష్ణ, 29వ వార్డు కౌన్సిలర్ జయరాం పవన్,1వ వార్డు కౌన్సిలర్ కసిని రజిత, 30వ వార్డు కౌన్సిలర్ వెంకట్రాజు, 36వ వార్డు కౌన్సిలర్ మాధురి, 34వ వార్డు కౌన్సిలర్ సమి, 15వ వార్డు కౌన్సిలర్ దిడ్డి విజయలక్ష్మి, 35వ వార్డు కౌన్సిలర్ జీవీ వీణా, 8వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్, 9వ వార్డు కౌన్సిలర్ మంనీల, 10వ వార్డు కౌన్సిలర్ స్రవంతి, 32వ వార్డు కౌన్సిలర్ రామప్పలు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు తేదీని ఖరారు చేయగానే అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు.
తూప్రాన్, ఫిబ్రవరి 12: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ ఛైర్మన్ రాఘవేందర్ గౌడ్పై అవిశ్వాస తీర్మాన నోటీసును సోమవారం మెదక్ కలెక్టర్ రాజర్షిషాకు కౌన్సిలర్లు అందజేశారు. తూప్రాన్ మున్సిపల్ కౌన్సిల్లో చైర్మన్తో కలిపి మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాసం పెట్టేందుకు 11 మంది సభ్యులు అవసరం ఉండగా, పది మంది సభ్యులే ఉండటంతో కొద్దిరోజులుగా మిగిలిన ఒక్క సభ్యుడి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. సోమవారం 2వ వార్డు కౌన్సిలర్ మామిడి వెంకటేశ్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పాటు అవిశ్వాసానికి మద్దతు తెలిపాడు. దీంతో అవిశ్వాసానికి అవసరమైన 11 మంది సభ్యులు సరిపోవడంతో సోమవారం సాయంత్రం కౌన్సిల్ సభ్యులంతా క్యాంప్నకు బయలుదేరారు.