రాయికోడ్, ఫిబ్రవరి 26: ప్రతిఒక్కరూ పిల్లలను చదివిస్తేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు (ఎంపీ) ఆర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం మండల పరిధి అల్లాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న బీరప్పస్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. గ్రామ కురుమ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది పెద్దగొల్ల జగన్నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని గొల్లకురుమలు విద్య, అర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు చదువుకునే పిల్లలకు తన వంతుగా సాయం చేస్తానన్నారు.
సమావేశంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్, రాష్ట్ర కురుమ సంఘం నాయకులు పైతర సాయికుమార్, తెలంగాణ గొర్రె,మేకల పెంపకందారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాపు మలిశెట్టి, వరం వైస్చైర్మన్ తుకారాం, మండల కురుమ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా కురుమ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కిష్టయ్య, ఎంపీటీసీ శంకరమ్మ, మాజీ సర్పంచ్లు నాగార్జున, ప్రవీణ్కుమార్, నర్సుమ్మ, మండల కురుమ యువజన సంఘం నాయకులు సింగితం రాజు, సంతోశ్, అగమయ్య, పాండు, గ్రామ కురుమ సంఘం నాయకులు పోతుల రాజు, అనిల్, తుకారం, తులాసీదాస్లు పాల్గొన్నారు.