మెదక్, జూలై 18 (నమస్తే తెలంగాణ): మెద క్ జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు పంట రుణమాఫీ వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారును ఆదేశించారు. పంట రుణమాఫీపై బ్యాంకర్లతో గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో జిల్లాలో లక్ష రూపాయల్లోపు రుణం తీసుకున్న 45882 మంది రైతులకు రూ.241.82 కోట్ల రుణాల సొమ్ము ను ప్రభుత్వం గురువారం జమ చేసిందని, సంబంధిత రైతులకు రుణమాఫీ సొమ్ము చేరేలా బ్యాంకులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూ చించారు.
మొదటి దశలో జరుగుతున్న రుణమాఫీ లబ్ధిదారుల జాబితా, పూర్తిస్థాయి లబ్ధిదారుల జాబితాతో లీడ్ బ్యాంకు మేనేజర్ బ్యాంకు వారీగా రీకన్సైల్ చేయాలని, లీడ్ బ్యాంక్ మేనేజర్కు పూర్తిస్థాయిలో బ్యాం కులు సమాచారం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. 12 డిసెబర్ 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు 09 డిసెంబర్ 2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, వ్యవసాయ సహకార సంఘాల బ్యాంకుల ద్వారా రైతులు చేసిన రుణాలను సైతం ప్రభుత్వం మాఫీ చేస్తుందని, ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ సొమ్ము వినియోగంపై, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ వివరాలు ప్రతిరోజూ రిపోర్టును అధికారులు అందజేయాలన్నారు. ప్రభు త్వం విడుదల చేసిన సొమ్ము సాఫీగా రైతులకు చేరేలా చూడాలని, ప్రతి మండల కేం ద్రంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సంబంధిత వచ్చే ఫిర్యాదులను 30 రోజుల్లో పరిషరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, ఎల్డీఎం నరసింహమూర్తి, బ్యాం కు కంట్రోలర్స్, బ్యాంక్ మేనేజర్లు, కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు.