సిద్దిపేట కలెక్టరేట్, జనవరి 6: దుబ్బాక నియోజకవర్గం పరిధిలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న కెనాల్స్పై ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో ఆయన సమీక్షించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇతర మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను ఆదేశించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దుబ్బాక నియోజకవర్గంలో వంగిన విద్యుత్ స్తంభాలు, మరమ్మతులకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి సరిచేయాలన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెలే మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలుగకుండా సాగునీరు సరఫరా చేయాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో అదన పు కలెక్టర్ అబ్దుల్హమీద్, కాళేశ్వరం ప్రాజెక్ట్ యూ నిట్ 1 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీత, ఇరిగేషన్ ఈఈ నారాయణ, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.