సంగారెడ్డి/ నారాయణఖేడ్, మార్చి 18 : రాష్ట్ర ప్రభు త్వం గ్రామీణాభివృద్ధ్దిశాఖలో విధులు నిర్వహిస్తున్న(సెర్ప్) ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేస్తూ ప్రభుత్వం జీవో నంబరు 11ను విడుదల చేసింది. 20 ఏండ్ల కల సాకారం చేయడంతో సెర్ప్ ఉద్యోగులు సంబురాలు చేసు కున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లో సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సెర్ప్ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని, పే స్కేల్ వర్తింపజేస్తూ జీవో జారీ చేయడం సంతోషకరమన్నారు.
జీవో విడుదలకు శ్రమించిన మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, చేనేత అభివృద్ధ్ది సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్తోపాటు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి వెంకట్, నాయకులు నర్సప్ప, మహేశ్, బాలకృష్ణ, శ్రీదేవి, శివలక్ష్మి, అమర్నాథ్, రాజశేఖర్, జయశ్రీ రాజ్, కొమురయ్య, రవీందర్, అనంతరాములు, అనిత, దాసుబాబు పాల్గొన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో ఐకేపీ ఉద్యోగులు మిఠాయిలు తినిపించుకుంటూ సంబురాలు చేసుకున్నారు.