మెదక్, మే12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో యాసంగి 2021-22 బియ్యం ఎఫ్సీఐకి డెలివరీ, పౌర సరఫరాల సంస్థకు బాకీ బియ్యం డెలివరీ వెంటనే పూర్తి చేయాలని పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. కలెక్టర్ రాజర్షిషా ఆధ్వర్యంలో జిల్లాలోని బాయిల్డ్, రా రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండిం గ్ బియ్యం డెలివరీ ఆలస్యంపై కారణాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్లకు ఇదే చివరి అవకాశమని బియ్యం డెలివరీ గడువు ఈ నెల 31తో ముగుస్తున్నదని తెలిపారు. రోజుకు మెదక్ జిల్లా నుంచి ఎఫ్సీఐకి సుమారుగా 60 ఏసీకేల బియ్యం, సివిల్ సప్లయ్కి 70 ఏసీకేల బియ్యం పూర్తి చేస్తేనే టార్గెట్ పూర్తవుతుందని, లేకపోతే మిల్లర్లు డిఫాల్ట్గా మిగిలిపోతారని హెచ్చరించారు.
ఒకవేళ మిల్లర్లు డిఫాల్ట్గా మిగిలితే 125 శాతం డబ్బు రూపంలో మిల్లర్ల నుంచి రికవరీ చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రతి మిల్కి ఆయా మండలాల తహసీల్దార్ పర్యవేక్షణ చేస్తూ రోజు వారీ టార్గెట్ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ ఉంటే ఆయా మిల్లర్ ధాన్యం వేరే ఇతర మిల్లులకు తరలించి ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా డీఫాల్ట్గా మిగిలోద్దని సూచించారు. రబీ 2022-23 ధాన్యం కొనుగోలు వేగవంతమయ్యిందని, జిల్లాలో ఈ నెల చివరి వరకు ధాన్యం కొనుగోలు పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రైస్ మిల్లుల వద్ద ధాన్యం లారీలు ఒక రోజు కంటే ఎకువ ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు ఆదేశించారు. జిల్లాలో రైతులు అధైర్య పడొద్దని ధాన్యం కొనుగోలు చేసిన వెను వెంటనే ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 50వేల టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని, మిగతా టార్గెట్ కూడా పూర్తి చేస్తామని, ఇప్పటి వరకు రూ.25 కోట్లు రైతుల అకౌంట్లో జమచేశామని తెలిపారు. మిగితావి త్వరలోనే రైతుల అకౌంట్లో వేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రమే శ్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి కరుణ, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భీమ య్య, రెవెన్యూ డివిజన్ అధికారులు, జిల్లా ట్రా న్స్పోర్టు అధికారి శ్రీనివాస్ గౌడ్, మిల్లర్లు పాల్గొన్నారు.