చేర్యాల : సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ ( Cheryal Tahsildar ) లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. సోమవారం తహసీల్ కార్యాలయంపై దాడులు నిర్వహించి తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ ( Korra Dileep Naik ) ను పట్టుకున్నారు. నాగాపురి గ్రామం జమున కనకమ్మ, మరికొందరి భూమిలో నాలా కన్వర్షన్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.70 వేలు డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఏసీబీ ( ACB ) ని ఆశ్రయించాడు.
దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో దాడులు చేసి తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు రికార్డులు, పత్రాలను పరిశీలించారు. లంచంతో పట్టుబడ్డ తహసీల్దార్పై కేసు నమోదు చేసి హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.